ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే బీసీలకు ప్రత్యేక గుర్తు రానుందని, బీసీల ఓట్లన్నీ వారికే వేస్తామని తెలిపారు. 2028లో తెలంగాణ ముఖ్యమంత్రి బీసీ వ్యక్తి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జేఏసీ పోటీ చేస్తుందని, బీసీలను మోసం చేస్తున్న అగ్రవర్ణ పార్టీలను ఓడిస్తామని సవాల్ విసిరారు. ప్రతి బీసీకి రెండెకరాల భూమి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలు మీకోసం