తెలంగాణలో మరో 28 కొత్త బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లు, మహబూబ్నగర్, నిజామాబాద్, బోధన్, సరూర్నగర్ జల్పల్లి మునిసిపాలిటీల్లో ఒక్కొక్కటి చొప్పున బార్లను ఏర్పాటు చేయనున్నారు. మే 15 నుంచి జూన్ 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దేశంలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఒక్కరు ఎన్నైనా దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దరఖాస్తు ఫీజు రూపంలో రూ.100 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సారి ఆబ్కారీ శాఖ ఓ బంపరాఫర్ ప్రకటించింది. ఆ వివరాలు..