తెలంగాణ కేబినెట్లోకి కొత్త మంత్రులు చేరారు. ఇవాళ ముగ్గురు ఎమ్మెల్యేలచే గవర్నర్ జిష్ణుదేవ్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం పూర్తి కావటంతో వారికి కేటాయించే శాఖలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రానికి కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయ్యే ఛాన్సుంది.