కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. ఎవరూ ఊహించని విధంగా..

1 year ago 43
తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నూతన మంత్రులకు శాఖలు కేటాయించారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, మైనింగ్.. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు.. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, క్రీడలు, యువజన శాఖలు అప్పగించారు. కొత్త మంత్రులు రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం 15 మంది మంత్రులు ఉండగా, మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే తాను ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై చర్చించలేదని సీఎం స్పష్టం చేశారు.
Read Entire Article