కొత్తగా రేషన్ కార్డు పొందారా..? అయితే మీకో గుడ్న్యూస్. ఈనెల నుంచి కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి రేషన్ బియ్యం సహా సరుకులు అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం సివిల్ సప్లయ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బియ్యం పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇంకా రేషన్ కార్డులు పొందని వారు గ్రామసభల్లో అప్లయ్ చేసుకోవాలని సూచించారు.