సిరిసిల్ల జిల్లాలో పేద కుటుంబాలకు ప్రభుత్వం కొత్త రేషన్కార్డులు మంజూరు చేసింది. జిల్లాలో 345 రేషన్ దుకాణాల పరిధిలో గతేడాది 1.73 లక్షల కార్డులు ఉండగా.. తాజాగా 16,859 కొత్త కార్డులు జారీ చేశారు. వీటితోపాటు 42,623 మంది లబ్ధిదారులు కొత్తగా నమోదు కాగా.. పాత కార్డుల మార్పులతో మరో 31,992 మందిని చేర్చారు. జూన్లో మూడు నెలల కోటా ఒకేసారి ఇచ్చినప్పుడు కొత్త కార్డుదారులు వెనుకబడ్డా.. సెప్టెంబర్ కోటాతో వారికి అవకాశం లభించింది.