New Ration Cards In Telangana: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తామని, దీని ద్వారా 3 కోట్ల 10 లక్షల మంది లబ్ధి పొందుతారని ఆయన తెలిపారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తామని, ఇది దేశంలోనే గొప్ప సంక్షేమ పథకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.