తెలంగాణ కొత్త రేషన్ కార్డుల మంజూరుపై కీలక అప్డేట్ వచ్చింది. ముందుగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కోడ్ ముగిసిన తర్వాత అన్ని జిల్లాల్లో కార్డులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు.