తెలంగాణలో కొత్తగా వాహనాల కొనుగోలు చేసేవారిపై అదనపు భారం పడనుంది. ప్రభుత్వం కొత్తగా 'రోడ్ సేఫ్టీ సెస్' పేరుతో అదనపు పన్నును విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పన్ను మెుత్తం వాహన రకాలను బట్టి రూ.2 వేల నుంచి రూ. 10 వేలు వసూలు చేయనున్నారు.