తెలంగాణలో అమృత్ భారత్ పథకం కింద కరీంనగర్ రైల్వే స్టేషన్ను విమానాశ్రయ తరహాలో అభివృద్ధి చేస్తున్నారు. పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఒక నెటిజన్ ఈ అభివృద్ధికి కారణం కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ అతడిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేయగా అది విపరీతంగా వైరల్ అయింది. ఈ పథకం ద్వారా స్టేషన్లో అనేక ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.