తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. కొన్ని రోజుల పాటు తనకు సరైన పని దొరికిందని పోస్ట్ చేశారు. మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ హైదరాబాద్ నగరంలో జరగనుండగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన ఆమె ఈ మేరకు ట్వీట్ చేసారు. ఈవెంట్ సక్సెస్ చేసేందుకు తమ బృందం సిద్ధంగా ఉందని అన్నారు.