Aid to AP Coconut Farmers: ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతులకు అండగా నిలిచేందుకు గాను కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. సరైన మార్కెటింగ్ లేక రైతులు నష్టపోతున్నారని, ఈ నిధులతో 'ఇంటిగ్రేటెడ్ కోకోనట్ డెవల్పమెంట్ అండ్ మార్కెట్ స్ట్రెత్నింగ్ ప్రోగ్రామ్' అమలు చేసి.. వారి ఆదాయాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ పథకం రైతులకు, గ్రామీణ ఉపాధికి మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.