హైదరాబాద్ కోఠిలో కాల్పులు కలకలం రేపాయి. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద గుర్తు తెలియని దుండుగులు కాల్పులు జరిపారు. బ్యాంకు ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వెళ్లిన రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేసారు.