వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన కార్పొరేటర్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మాటల మంటలు రేపుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆయన కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వ్యాఖ్యలకు జనసేన పార్టీ స్పందించింది. జగన్ను తాము కూడా కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని అనగలమని.. కానీ సభ్యత అడ్డొస్తోందంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటరిచ్చారు.