అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో గ్యాస్ లీకైంది. కేశనపల్లిలోని గ్యాస్ గ్యాదరింగ్ స్టేషన్లో గ్యాస్ లీకైంది. దీంతో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. శ్వాస ఆడక ఇబ్బందులు పడ్డారు. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అమలాపురం ఆర్డీవో, రాజోలు సీఐ వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.