కోనసీమ జిల్లాలో విషాదం.. బస్సు కిటీకీలో నుంచి తొంగిచూస్తూ.. ఇంటర్ విద్యార్థి మృతి

6 months ago 22
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ముమ్మిడివరం మండలంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ ఇంటర్ విద్యార్థి అనుకోని విధంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వెంకట రవీంద్ర అనే ఇంటర్మీడియట్ విద్యార్థి.. తలను కిటికీ నుంచి బయట పెట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద వెంకట రవీంద్ర తలకు స్తంభం తగలడంతో.. తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో బస్సులో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article