డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. అయినవిల్లి తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నాగలక్ష్మమ్మపై మీసాల సత్యనారాయణ అనే వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో తహసీల్దార్కు గాయాలయ్యాయి. సత్యనారాయణ మద్యం మత్తులో ఉన్నాడని, గతంలో కూడా నేర చరిత్ర కలిగి ఉన్నాడని సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తహసీల్దార్ను పరామర్శించిన కలెక్టర్.. జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని హామి ఇచ్చారు.