తెలంగాణలో ఆధార్ కార్డు సేవలను పోస్టాఫీసులు మరింత సులభతరం చేశాయి. ఒకప్పుడు ప్రజలు ఆధార్ కేంద్రాలు, బ్యాంకుల ముందు క్యూలు కట్టి ఇబ్బందులు పడితే.. ఇప్పుడు స్థానిక కాలనీల్లోనే పోస్టల్ సిబ్బంది ఆధార్ శిబిరాలు నిర్వహిస్తున్నారు. కొత్తగా ఆధార్ కార్డు తీసుకునేవారు, వాటిలో సవరణలు, అడ్రస్ మార్పు, ఫోన్ నంబర్ మార్పులు అన్నీ ఒకేచోట పూర్తి చేయగలిగే విధంగా అధికారులు 15 రోజుల్లో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సౌకర్యం వలన తెలంగాణ ప్రజలకు ఆధార్ సేవలు మరింత చేరువకానున్నాయి.