కోస్గి పాంచజన్య సంకల్ప సభలో కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. 2009లో కోస్గి ఎన్నికల ప్రచారంలో తనతో పాటు చంద్రబాబు, రేవంత్రెడ్డి పాల్గొన్నారని.. తర్వాత వారిద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారని గుర్తుచేశారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది తానే అని ఆమె చెప్పకనే చెప్పారు. తాను ఎవరి బాణాన్ని కాదని.. తెలంగాణ బహుజనుల బాణాన్ని అని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే పాలమూరులో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని.. విద్య, వైద్యానికి భారీగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.