కౌలు రైతులకు తీపి కబురు.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

2 years ago 70
ఏపీలోని కౌలు రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కౌలు రైతులకు కూడా రుణాలు అందిస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. కౌలు రైతులకు బ్యాంకు రుణాలతో పాటుగా.. సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి లోన్లు ఇస్తామని తెలిపారు. అలాగే 2019లో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టం రద్దు చేస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. వైసీపీ తెచ్చిన చట్టాన్ని రద్దు చేసి గతంలో టీడీపీ ప్రభుత్వం 2016లో చేసిన కౌలు రైతుల చట్టాన్ని అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Read Entire Article