ఏపీలోని క్రికెట్ ఫ్యాన్స్కు పండగలాంటి వార్త.. ఏకంగా ఐదు ప్రపంచకప్ మ్యాచ్లు చూసే అవకాశం.. 2025 మహిళల వన్డే ప్రపంచకప్కు భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐసీసీ వేదికలను ఖరారు చేసింది. అందులో మన విశాఖపట్నం కూడా ఉండటం విశేషం. దీంతో విశాఖలో ప్రపంచకప్ మ్యాచ్లు వీక్షించే అవకాశం కలగనుంది. అయితే ప్రపంచకప్లో భాగంగా ఐదు మ్యాచ్లు విశాఖపట్నంలో జరగనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. ఒక వన్డే మ్యాచ్ కూడా విశాఖలో జరుగుతుందని వివరించారు.