ఛత్తీస్గఢ్లోని కిస్టియన్లను మార్చి 1 నుంచి చంపేయాలని ఆర్ఎస్ఎస్కు చెందిన హిందువులు పిలుపునిచ్చారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిందువుల గుంపు ఓ చోట చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు. అయితే ఆ వైరల్ వీడియోలోని అసలు వాస్తవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.