జలహారతి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్పై విమర్శలు గుప్పించారు. రాయలసీమ కరువు కష్టాలు తనకే తెలుసని, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. హంద్రీనీవా నీటి విడుదల సందర్భంగా రాయలసీమ అభివృద్ధికి తాను కంకణం కట్టుకున్నానని చంద్రబాబు అన్నారు. క్లైమోర్ మైన్లనే తట్టుకున్నానని, జగన్ విమర్శలు తననేమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చారు. శ్రీశైలం నుంచి తిరుపతి వరకు నీళ్లు తీసుకెళ్లేలా చూస్తామన్నారు.