ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్పై ఎస్డబ్ల్యూయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్లో ఫిర్యాదు వస్తే విచారణ లేకుండానే కార్మికులను సస్పెండ్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఫిర్యాదులపై చర్యలు తీసుకోవద్దని, సమస్యలపై చర్చించాలని సజ్జన్నార్కు రాజిరెడ్డి డెడ్ లైన్ విధించారు. లేకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.