ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. మున్నేరు ముంపు ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా వరద బాధితులతో మాట్లాడారు. ఆహారం, తాగునీరు, వైద్య సహాయంపై వరద బాధితులను అడిగి తెలుసుకొన్నారు. బాధితులను ఆదుకునేందుకు సామాజిక, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.