ఖమ్మంలో షాకింగ్ ఘటన.. ఏకంగా లేడీ ఎస్సై మీదే దాడి

9 months ago 23
ఖమ్మం జిల్లా కల్లూరులో శుక్రవారం రాత్రి సంచలన ఘటన చోటుచేసుకుంది. కల్లూరు ఎన్ఎస్‌పీ సెంటర్ వద్ద హోటల్ సిబ్బందితో గొడవపడుతున్న రాయల రాము అనే వ్యక్తిని వారించేందుకు వెళ్లిన ఎస్సై హరితపై దాడి జరిగింది. రాము, అతని అనుచరులు ఎస్సైతో వాగ్వాదానికి దిగి, ఆమెను నెట్టేశారు. పోలీసులు రాముతో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకుని పెనుబల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటన కల్లూరులో కలకలం రేపింది.
Read Entire Article