ఖమ్మంలో వెలుగుమట్ల భూముల వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. బాధితులకు న్యాయం చేయాలంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దీక్ష చేపట్టగా.. ఇవాళ ఉదయం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. వందల మంది పోలీసులతో ఖమ్మంలోని దీక్షా శిబిరానికి చేరుకొని బలవంతంగా అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ తరలిస్తున్నారు.