గాంధీ ఆస్పత్రి వైద్యులు అద్భుతం చేశారు. ఖరీదైన ఐవీఎఫ్ చికిత్సను ఉచితంగా అందించి మహిళకు మాతృప్రేమ దక్కేలా చేశారు. సంతానలేమితో బాధపడుతున్న ఓ మహిళ ఆసుపత్రిలో ఐవీఎఫ్ చికిత్స తీసుకొని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో డాక్టర్లు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. కాగా, ప్రైవేటులో ఈ చికిత్సకు లక్షల్లో ఖర్చవువతుండగా.. గాంధీలో ఉచితంగా అందిస్తున్నారు.