హైదరాబాద్ నగరంలో ప్రజా అవసరాల కోసం అనుసంధాన రహదారుల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష జరిగింది. హెచ్ఎండీఏ పరిధిలో 49 రోడ్ల నిర్మాణం, విస్తరణ జరగాలని సీఎం సూచించారు. ప్రయాణికుల ఇబ్బందులు తొలగించి సమయం ఆదా చేసేందుకై అదనపు భూసేకరణకు అత్యధిక వ్యయం అయినా వెనకాడేది లేదన్నారు సీఎం. ప్రవాసీ మిత్ర సంస్థ “రేవంత్ సర్కారు - గల్ఫ్ భరోసా” పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.