మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం కల్పిస్తూనే.. 600 బస్సులకు మహిళలను యజమానులుగా చేశామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో వెల్లడించారు. వారికి నెలకు రూ.70 వేల ఆదాయం అందేలా చూశామన్నారు. ఆర్టీసీ మౌలిక వసతులకు రూ.100 కోట్లు, కార్మికులకు రూ.కోటి బీమా, పీఎఫ్ బకాయిల చెల్లింపుతో సంస్థను బలోపేతం చేస్తున్నట్లు ప్రకటించారు.