తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లాకు రోప్వే ఏర్పాటు కోసం ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తుండగా.. తాజాగా దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి ఫలితంగా పర్వతమాల ప్రాజెక్టులో భాగంగా రూ.2.46 కోట్లతో 2.1 కి.మీ. రోప్వే నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది పర్యాటకులకు సులభమైన ప్రయాణాన్ని అందించి, ఖిల్లాకు జాతీయ గుర్తింపు తెస్తుందని భావిస్తున్నారు.