హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతి దర్శనానికి ఈరోజే ఆఖరి రోజు కావడంతో భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. భారీగా తరలివస్తున్న భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. రద్దీ, వేడి కారణంగా బుధవారం కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. ఈ రాత్రి 12 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఇక నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.