ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి వచ్చిన రాజస్థాన్కు చెందిన రేష్మ అనే గర్భిణికి వినాయకుడి సన్నిధిలోనే పురిటి నొప్పులు రావడంతో అక్కడే మగబిడ్డకు జన్మనిచ్చింది. వైద్య శిబిరంలో వైద్యులు వెంటనే ప్రసవం చేయగా, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. గణపతి అనుగ్రహంతోనే తమకు కొడుకు పుట్టాడని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.