ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తయింది. 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని.. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు. లంబోదరుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు భారీగా ట్యాంక్బండ్ వద్దకు చేరుకున్నారు. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా చూసి భక్తులు తరించిపోయారు.