బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. గురువారం (ఫిబ్రవరి 20న) ఉదయం ఏఐజీ ఆస్పత్రికి తన సతీమణి శోభతో కలిసి వెళ్లారు. వీళ్ల వెంట సంతోష్ రావు కూడా ఉన్నారు. అయితే.. కేసీఆర్ ఉన్నట్టుండి ఆస్పత్రి వెళ్లటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఆరోగ్యానికి ఏమైంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.