తెలంగాణలో విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ 6,267 మెగావాట్లకు చేరుకుంది. దీనికి కారణంగా ఎండల తీవ్రత పెరగటమేనని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వెల్లడించారు. రానున్న రోజుల్లో మరింత విద్యుత్ వినియోగం ఉంటుందని అందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.