జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా 12 గ్రామాల ప్రజలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పరిశ్రమ ఏర్పాటు చేయబోమని ప్రభుత్వం హామీ ఇచ్చినా.. గాయత్రి కంపెనీ రహస్యంగా పనులు ప్రారంభించడంతో ప్రజాగ్రహం పెల్లుబికింది. ఆగ్రహించిన రైతులు, మహిళలు కంపెనీ వాహనాలను, టెంట్లను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. పోలీసులు భారీగా మోహరించినప్పటికీ ఆందోళనకారులను అదుపు చేయటం వారి వల్ల కాలేదు.