హనుమకొండ జిల్లా కమలాపూర్లో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం ఓ బాలింతకు ప్రమాదం తెచ్చిపెట్టింది. ఉప్పల్ గ్రామానికి చెందిన వాణరాసి తిరుమల అనే గర్భిణీకి సిజేరియన్ చేసిన అనంతరం కడుపులో బ్యాండేజీ మరిచిపోయారు. ఇంటికెళ్లిన ఆమెకు నొప్పి రావడంతో తిరిగి ఆసుపత్రికి రాగా విషయం బయటపడింది. వైద్యుల నిర్లక్ష్యంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.