విశాఖపట్నం తీరంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున అందజేయాలని మంత్రి అచ్చెన్నాయుడు విశాఖపట్నం కలెక్టర్ను ఆదేశించారు. బాధిత కుటుంబాల ఆవేదన కలచివేస్తోందన్న మంత్రి అచ్చెన్నాయుడు..గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఆచూకీ లభించేవరకూ గాలింపు చర్యలను కొనసాగిస్తామని తెలిపారు.