మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 2వ తేదీన నగరంలోని అన్ని మాంసం దుకాణాలు మూసివేయనున్నారు. గొర్రెలు, మేకలు, పశువులు, పందుల మాంసం విక్రయించే రిటైల్ దుకాణాలతో పాటు, గొడ్డు మాంసం విక్రయ కేంద్రాలు కూడా పూర్తిగా మూసివేయాలని GHMC ఆదేశించింది. గాంధీ జయంతి సందర్భంగా హింసకు తావు లేకుండా ఈ చర్య తీసుకున్నారు. మున్సిపల్ అధికారులు ఈ ఆదేశాల అమలును పర్యవేక్షిస్తారు.