సీఎం రేవంత్ రెడ్డికి గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ ఒక విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో మూసీ నది ఒడ్డున తెలంగాణ సర్కార్ నిర్మించదలచిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని కోరారు. గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు.. అక్కడ ఉన్న ఇళ్లను కూలగొట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వెంటనే ఇళ్లను కూల్చడాన్ని ఆపేయాలని పేర్కొన్నారు. ఒక వేళ గాంధీ బతికి ఉంటే.. ఇలా చేయొద్దని చెప్పేవారని తుషార్ గాంధీ వెల్లడించారు.