Guntur Manasa Sarovaram Park Development: గుంటూరు మానస సరోవరం పార్క్ రూ.18.35 కోట్లతో పునరుద్ధరణకు సిద్ధమైంది. గత వైభవాన్ని సంతరించుకునేలా ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు. కేంద్ర సాస్కీ పథకం ద్వారా ఈ పనులు చేపట్టనున్నారు. ఒకప్పుడు వేలాది మంది సందర్శకులతో కళకళలాడిన ఈ పార్క్, నిర్లక్ష్యంతో అధ్వానంగా మారింది. ఇప్పుడు కొత్త రూపు సంతరించుకోనుంది. ఈ మేరకు ప్రతిపాదనల్ని కూడా సిద్ధం చేశారు.. త్వరలోనే పూర్తిగా క్లారిటీ వస్తుంది