Guntur Traffic Restrictions And Diversions: గుంటూరు నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ వద్ద నూతన ఆర్వోబీ నిర్మాణం కారణంగా జూన్ 23 నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ట్రాఫిక్ మళ్లింపులకు సహకరించాలని కోరారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక మార్గాలను సూచిస్తూ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు ఈ మార్పులను గమనించి ప్రయాణాలు సాగించాలని విజ్ఞప్తి చేశారు.