సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగామా గ్రామ శివారులోని విఠలేశ్వర టెంపుల్ అధిపతి నాగన్నా మహరాజ్ రహస్యంగా భక్తి ముసుగులో గంజాయి సాగుచేస్తున్నారు. రహస్య సమాచారం మేరకు ఎక్సయిజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి సుమారు (600) గంజాయి మొక్కలను ద్వంసం చేశారు. గుడిలో నిల్వ ఉంచిన 5 బస్తాల్లో సుమారు 15 కేజీ ల ఎండు గంజాయిని సైతం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. 30,000 రూపాయల నగదు , గంజాయి విత్తనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.