Kathari Eshwar Kumar House Theft Incident: గుడివాడలో దొంగలు రెచ్చిపోయారు. మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ ఇంట్లో చోరీకి తెగబడ్డారు. ఇంటి తాళం పగులగొట్టి వెండిని ఎత్తుకెళ్లారు. ఈశ్వర్కుమార్ భార్య హైదరాబాద్ వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి చోరీ జరిగింది. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండగా.. 10 కిలోల వెండి వస్తువులు, పూజా సామాగ్రిని ఎత్తుకెళ్లారు. కఠారి సతీమణి మధురిమ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.