గుడివాడలో వైసీపీ కార్యక్రమం.. దూరంగా కొడాలి నాని.. అసలు కారణం అదా?

8 months ago 13
కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేసింది. అటు టీడీపీ కూటమి పార్టీలు సుపరిపాలనలో తొలి అడుగు అంటూ కార్యక్రమం చేపట్టాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ర్యాలీ నిర్వహించగా.. నాగవరప్పాడు సెంటర్ వద్దకు రాగానే టీడీపీ శ్రేణులు వైసీపీ ఏర్పాటు చేసిన బ్యానర్లను చించివేశాయి. అలాగే వైసీపీ కార్యక్రమం జరుగుతున్న కె. కన్వెన్షన్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేయటంతో పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు వైసీపీ కార్యక్రమానికి కొడాలి నాని దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.
Read Entire Article