గుడ్‌న్యూస్ చెప్పిన పవన్ కళ్యాణ్.. వారికి ఇంటి వద్దకే రేషన్ సరుకులు, రేపట్నుంచే!

1 year ago 37
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 1వ తేదీ నుంచి రేషన్ పంపిణీలో కూటమి ప్రభుత్వం సమూల మార్పులు తీసుకురానుంది. ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు అందించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ పంపిణీలో అక్రమాలు, ఇబ్బందులు తలెత్తాయని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించనున్నట్లు తెలిపారు.
Read Entire Article