మిస్ వరల్డ్ 2025 పోటీలను హైదరాబాద్లో విజయవంతంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మే 10 నుంచి 31 వరకు జరిగే ఈ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా 116 దేశాల నుంచి యువతులు హాజరవుతారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా ఏర్పాట్లు చేయాలని, నగరంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా సాధికారతను తెలిపే కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.