తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. బోధన ప్రమాణాలు పెంచడం, విద్యార్థులకు భాషా జ్ఞానంతో పాటు నైపుణ్యాభివృద్ధి కల్పించడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. గురుకులాల తరహా సదుపాయాలు డే స్కాలర్స్కూ అందించే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు.