తెలంగాణలోని గురుకులాలు, వసతి గృహాల్లో అల్యూమినియం పాత్రల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. వాటి వల్ల కలిగే ఆరోగ్య నష్టాలను దృష్టిలో ఉంచుకొని, ఇకపై స్టీల్ పాత్రల్లోనే వంటలు చేయాలని అధికారులను ఆదేశించారు. స్టీల్ పాత్రల కొనుగోలుకు అంచనాలు సిద్ధం చేయాలన్నారు. విద్యా ప్రమాణాలు పెంచాలని, వచ్చే ఏడాది నుంచీ యూనిఫాం, పుస్తకాలు ముందుగానే అందిస్తామని హామీ ఇచ్చారు.